విలువలు – విజ్ఞానం – వినోదం కలగలిపిన బాలసాహిత్య రత్నం “బహుమతుల కాకి” కథా సంపుటి.
నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లల దృష్టి ఎక్కువగా తెరలపైనే కేంద్రీకృతమవుతున్నది. అలాంటి ఈ కాలంలో, మంచి పుస్తకం చేతిలో పడితే వారి ఊహాశక్తి, ఆలోచనా ధోరణి, భావోద్వేగాలు, పిల్లల సున్నితత్వం మరింత వికసిస్తాయి. అలాంటి పఠనానుభూతిని అందించే బాలల కథాసంపుటి “బహుమతుల కాకి”. నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న విజ్ఞాన ప్రచురణల వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. బాలల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్న కథా రచయిత “టి.వి. రామకృష్ణ గారు” ఈ సంకలనంలో మొత్తం 15 కథలను అందించారు. డిసెంబర్ 2025లో తొలి ముద్రణగా 1000 ప్రతులు వెలువడటం ఈ పుస్తకంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
ఈ కథాసంపుటి ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి కథలో వినోదం వెనుక ఒక విలువ దాగి ఉంటుంది; ప్రతి సంఘటన వెనుక ఒక జీవనపాఠం నిలుస్తుంది. ఉపదేశాత్మక ధోరణి కాకుండా, అనుభూతి ద్వారా పిల్లలకు సందేశాన్ని అందించడం అనేది ఈ రచయిత నైపుణ్యం.
ప్రకృతి – స్నేహం – మనసుల మమకారం
“బహుమతుల కాకి” అనే తొలి కథలో చిన్నారి మేఘన మరియు ఒక కాకి మధ్య ఏర్పడిన అమాయక స్నేహాన్ని హృద్యంగా ఆవిష్కరింపజేశారు. ప్రకృతితో మమేకమవడం, జీవరాశుల పట్ల కరుణ చూపడం, నిరీక్షణలోని ప్రేమ – ఇవన్నీ కథలో సహజంగా అనిపిస్తాయి. పిల్లలు చదివేటప్పుడు తాము కూడా ఆ చెట్టు క్రింద కూర్చున్నట్టుగా అనుభూతి చెందుతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
“అభయ్ ఆలోచన”, “మధులిక పుట్టినరోజు” వంటి కథలు ప్రకృతి, పల్లె జీవన వాతావరణం, జంతు–పక్షుల ప్రపంచం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి. ఈ కథలు పిల్లలలో పరిశీలనా దృష్టిని పెంచుతాయి.
విజ్ఞాన ప్రేరణ – సృజనాత్మక దిశ
“ఆకాశంలో పక్షులు – జంతువులు” కథ ఖగోళ విజ్ఞానంపై ఆసక్తిని కలిగిస్తుంది. తాతయ్య ఇచ్చిన టెలిస్కోప్ ఒక సాధారణ బహుమతి మాత్రమే కాదు – అది చిన్నారులలో జ్ఞానాన్వేషణకు పునాది వేస్తుంది.
“కృత్రిమ మేధా” కథలో భవిష్యత్ విద్యావిధానాల రూపురేఖలను రచయిత చక్కగా ఊహించారు. ఇందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు భయపెట్టే విధంగా కాకుండా, నేర్చుకోవడానికి ఉపకరించే సాధనంగా చూపించడం ప్రశంసనీయం.
ధైర్యం – వ్యక్తిత్వ వికాసం
“పప్పు సాహసం” కథ స్నేహం, ధైర్యం, సమయస్ఫూర్తి విలువలను బలంగా ప్రతిపాదిస్తుంది.
“మార్పు కోరిన కాలుడు” కథ ఇతరులను అనుకరించాలనే కోరిక వెనుక ఉన్న అపోహలను చెదరగొట్టి, స్వీయ సామర్థ్యాన్ని గుర్తించుకోవాలని సూచిస్తుంది.
“విరబూసిన బంతి చెట్టు” కథలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించేందుకు రచయిత ప్రయత్నించారు. శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అభిప్రాయాన్ని కథలో సున్నితంగా మేళవించి చెప్పడం చాలా బాగా అనిపించింది.
చరిత్ర – సంస్కృతి – కుటుంబ విలువలు
“దుర్గాబాయి” కథ ద్వారా దుర్గాబాయి దేశ్ముఖ్ జీవిత స్ఫూర్తిని పరిచయం చేశారు. చిన్నారులకి చరిత్రను భారంగా కాకుండా ప్రేరణాత్మకంగా అందించడం అభినందనీయం.
“క్షీరసాగర మథనం” కథ పురాణ గాథను బాలల భాషలో సరళంగా వివరిస్తుంది.
“చంటిగాడు” కథ కుటుంబ జీవనంలోని అల్లరిని, అనుబంధాన్ని ముద్దుగా చూపిస్తుంది.
రూపకల్పన ప్రత్యేకత
ఈ పుస్తకంలోని ప్రతి కథకు జతచేసిన ఆకర్షణీయమైన ఏఐ చిత్రాలు కథానుభూతిని మరింత సజీవంగా మారుస్తాయి. చిత్రాలు పిల్లల ఊహాశక్తిని విస్తరింపజేస్తాయి. భాష సరళంగానూ, వాక్య నిర్మాణం సూటిగా సులభ గ్రాహ్యంగానూ ఉన్నది. మంచి చక్కటి పిల్లలకు ఆకషణీయమైన రీతిలో చక్కటి ముఖచిత్రాన్ని కూడా అందించారు. రంగు కూడా ప్రకృతిని సూచించేలా ఉన్నది.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, “బహుమతుల కాకి” కేవలం కథల సంకలనం కాదు; అది పిల్లల మనసుల్లో విలువల విత్తనాలు నాటే పుస్తకం. ప్రకృతి ప్రేమ, విజ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ అనుబంధం – ఇవన్నీ ఒకే గ్రంథంలో సమన్వయమై ఉండటం ఇందులోని విశేషం.
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పఠనానుభూతి అందించాలనుకుంటే, ఉపాధ్యాయులు తమ పిల్లలను మంచి విజ్ఞానదాయకులుగా రూపుదిద్దాలనుక్కున్నా.. గ్రంథాలయంలో చేర్చదగిన మంచి పుస్తకం కోసం వెతుకుతుంటే – “బహుమతుల కాకి” సరైన ఎంపిక.
ఈ పుస్తకం ధర కేవలము రూ.120/- మాత్రమే. పుస్తకాన్ని పొందదలచిన వారు సంప్రదించవలసిన చిరునామా: జి. మాల్యాద్రి
విజ్ఞాన ప్రచురణలు,
ప్రజా సైన్స్ వేదిక ప్రచురణల విభాగం
162, విజయలక్ష్మీ నగర్, నెల్లూరు – 524004
సెల్: 9440503061
చిన్నారుల చేతిలో మంచి పుస్తకం ఉంటే – వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది. ఆ ప్రకాశానికి ఒక చిన్న దీప్తి “బహుమతుల కాకి”.
……………….
సమీక్ష : “నవ్యకవితాకళానిధి” మద్దిరాల శ్రీనివాసులు
ఉపాధ్యాయుడు, రచయిత (cell:9010619066)
తేది:05-10-2022, "నేటి నిజం" దినపత్రికలో.... ప్రచురించబడిన నా పుస్తక సమీక్ష తేది:19-09-2022, దిశ దినపత్రికలో.... ప్రచురించబడిన నా పుస్తక సమీక్ష

విలువలు – విజ్ఞానం – వినోదం కలగలిపిన బాలసాహిత్య రత్నం “బహుమతుల కాకి” కథా సంపుటి.
నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లల దృష్టి ఎక్కువగా తెరలపైనే కేంద్రీకృతమవుతున్నది. అలాంటి ఈ కాలంలో, మంచి పుస్తకం చేతిలో పడితే వారి ఊహాశక్తి, ఆలోచనా ధోరణి, భావోద్వేగాలు, పిల్లల సున్నితత్వం మరింత వికసిస్తాయి. అలాంటి పఠనానుభూతిని అందించే బాలల కథాసంపుటి “బహుమతుల కాకి”. నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న విజ్ఞాన ప్రచురణల వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. బాలల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్న కథా రచయిత “టి.వి. రామకృష్ణ గారు” ఈ సంకలనంలో మొత్తం 15 కథలను అందించారు. డిసెంబర్ 2025లో తొలి ముద్రణగా 1000 ప్రతులు వెలువడటం ఈ పుస్తకంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
ఈ కథాసంపుటి ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి కథలో వినోదం వెనుక ఒక విలువ దాగి ఉంటుంది; ప్రతి సంఘటన వెనుక ఒక జీవనపాఠం నిలుస్తుంది. ఉపదేశాత్మక ధోరణి కాకుండా, అనుభూతి ద్వారా పిల్లలకు సందేశాన్ని అందించడం అనేది ఈ రచయిత నైపుణ్యం.
ప్రకృతి – స్నేహం – మనసుల మమకారం
“బహుమతుల కాకి” అనే తొలి కథలో చిన్నారి మేఘన మరియు ఒక కాకి మధ్య ఏర్పడిన అమాయక స్నేహాన్ని హృద్యంగా ఆవిష్కరింపజేశారు. ప్రకృతితో మమేకమవడం, జీవరాశుల పట్ల కరుణ చూపడం, నిరీక్షణలోని ప్రేమ – ఇవన్నీ కథలో సహజంగా అనిపిస్తాయి. పిల్లలు చదివేటప్పుడు తాము కూడా ఆ చెట్టు క్రింద కూర్చున్నట్టుగా అనుభూతి చెందుతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
“అభయ్ ఆలోచన”, “మధులిక పుట్టినరోజు” వంటి కథలు ప్రకృతి, పల్లె జీవన వాతావరణం, జంతు–పక్షుల ప్రపంచం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి. ఈ కథలు పిల్లలలో పరిశీలనా దృష్టిని పెంచుతాయి.
విజ్ఞాన ప్రేరణ – సృజనాత్మక దిశ
“ఆకాశంలో పక్షులు – జంతువులు” కథ ఖగోళ విజ్ఞానంపై ఆసక్తిని కలిగిస్తుంది. తాతయ్య ఇచ్చిన టెలిస్కోప్ ఒక సాధారణ బహుమతి మాత్రమే కాదు – అది చిన్నారులలో జ్ఞానాన్వేషణకు పునాది వేస్తుంది.
“కృత్రిమ మేధా” కథలో భవిష్యత్ విద్యావిధానాల రూపురేఖలను రచయిత చక్కగా ఊహించారు. ఇందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు భయపెట్టే విధంగా కాకుండా, నేర్చుకోవడానికి ఉపకరించే సాధనంగా చూపించడం ప్రశంసనీయం.
ధైర్యం – వ్యక్తిత్వ వికాసం
“పప్పు సాహసం” కథ స్నేహం, ధైర్యం, సమయస్ఫూర్తి విలువలను బలంగా ప్రతిపాదిస్తుంది.
“మార్పు కోరిన కాలుడు” కథ ఇతరులను అనుకరించాలనే కోరిక వెనుక ఉన్న అపోహలను చెదరగొట్టి, స్వీయ సామర్థ్యాన్ని గుర్తించుకోవాలని సూచిస్తుంది.
“విరబూసిన బంతి చెట్టు” కథలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించేందుకు రచయిత ప్రయత్నించారు. శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అభిప్రాయాన్ని కథలో సున్నితంగా మేళవించి చెప్పడం చాలా బాగా అనిపించింది.
చరిత్ర – సంస్కృతి – కుటుంబ విలువలు
“దుర్గాబాయి” కథ ద్వారా దుర్గాబాయి దేశ్ముఖ్ జీవిత స్ఫూర్తిని పరిచయం చేశారు. చిన్నారులకి చరిత్రను భారంగా కాకుండా ప్రేరణాత్మకంగా అందించడం అభినందనీయం.
“క్షీరసాగర మథనం” కథ పురాణ గాథను బాలల భాషలో సరళంగా వివరిస్తుంది.
“చంటిగాడు” కథ కుటుంబ జీవనంలోని అల్లరిని, అనుబంధాన్ని ముద్దుగా చూపిస్తుంది.
రూపకల్పన ప్రత్యేకత
ఈ పుస్తకంలోని ప్రతి కథకు జతచేసిన ఆకర్షణీయమైన ఏఐ చిత్రాలు కథానుభూతిని మరింత సజీవంగా మారుస్తాయి. చిత్రాలు పిల్లల ఊహాశక్తిని విస్తరింపజేస్తాయి. భాష సరళంగానూ, వాక్య నిర్మాణం సూటిగా సులభ గ్రాహ్యంగానూ ఉన్నది. మంచి చక్కటి పిల్లలకు ఆకషణీయమైన రీతిలో చక్కటి ముఖచిత్రాన్ని కూడా అందించారు. రంగు కూడా ప్రకృతిని సూచించేలా ఉన్నది.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, “బహుమతుల కాకి” కేవలం కథల సంకలనం కాదు; అది పిల్లల మనసుల్లో విలువల విత్తనాలు నాటే పుస్తకం. ప్రకృతి ప్రేమ, విజ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ అనుబంధం – ఇవన్నీ ఒకే గ్రంథంలో సమన్వయమై ఉండటం ఇందులోని విశేషం.
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పఠనానుభూతి అందించాలనుకుంటే, ఉపాధ్యాయులు తమ పిల్లలను మంచి విజ్ఞానదాయకులుగా రూపుదిద్దాలనుక్కున్నా.. గ్రంథాలయంలో చేర్చదగిన మంచి పుస్తకం కోసం వెతుకుతుంటే – “బహుమతుల కాకి” సరైన ఎంపిక.
ఈ పుస్తకం ధర కేవలము రూ.120/- మాత్రమే. పుస్తకాన్ని పొందదలచిన వారు సంప్రదించవలసిన చిరునామా: జి. మాల్యాద్రి
విజ్ఞాన ప్రచురణలు,
ప్రజా సైన్స్ వేదిక ప్రచురణల విభాగం
162, విజయలక్ష్మీ నగర్, నెల్లూరు – 524004
సెల్: 9440503061
చిన్నారుల చేతిలో మంచి పుస్తకం ఉంటే – వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది. ఆ ప్రకాశానికి ఒక చిన్న దీప్తి “బహుమతుల కాకి”.
……………….
సమీక్ష : “నవ్యకవితాకళానిధి” మద్దిరాల శ్రీనివాసులు
ఉపాధ్యాయుడు, రచయిత (cell:9010619066)
నేటి విద్యార్థులు,ఉపాధ్యాయులకు ఆదర్శం - హెలెన్ కెల్లర్ జీవిత గాథ
మొత్తంపై ఈ పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక
వ్యక్తి, చదువదగినదే. అయితే రఘురామయ్య అనే తండ్రి పాత్ర డిక్టేటర్ అయ్యింది. మొదట్లో
అలా వుంచినా చివరికి పిల్లల నడవడిక ద్వారా
తండ్రిలో మార్పు వచ్చేలా మలచి, తనతో కూడా హెలెన్ గురించి మాట్లాడించడమో, మంచిపని చేసేటపుడు
భయపడవలసిన పని లేదనే సందేశం ఇప్పించడమో చేసి వుంటే బాగుండేది . పుస్తకం చూడడానికి
చిన్నదిగా కనిపించినా క్వాలిటీపరంగా, పుస్తకం లోని విజ్ఞాన విలువ పరంగా చూస్తే రూ.
30.00 లు అనేది చాలా తక్కువ ఖరీదు. అన్ని
విశాలాంధ్ర బుక్ హౌస్ ల లోనూ లభ్యమవుతుంది.
పూర్తి వివరాలకు visalaandhraph@yahoo.com అనే ఈమెయుల్ మరియు అనే www.visalaandhraph.net వెబ్ సైట్ లోనూ సంప్రదించవచ్చును.
గిజూభాయి గారి " పగటికల " పై నా సమీక్ష ఈ పుస్తకము యొక్క సమీక్షను.... ఈ లింక్ ద్వారా pustakam.net లో చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
"పగటి కల" కాదిది సాధించగల " నిజమైన కల" ........ మద్దిరాల శ్రీనివాసులు, సెల్ : 9010619066
నైతిక విలువలకు నెలవు - "కథా చిత్రాలు, - బతుకు పాఠాలు " " పుస్తకం ఈ పుస్తకము యొక్క సమీక్షను.... ఈ లింక్ ద్వారా pustakam.net లో చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మద్దిరాల శ్రీనివాసులు, టీచర్
పుస్తకం పేరును గమనిస్తే "కథాచిత్రాలు" అనగా " మన కళ్ళముందు కనపడే ఆ కథల భావ దృశ్యాలు" అనీ, "బతుకు పాఠాలు" అనగా "మన జీవితాలలో జరిగే అనుభవ సారాలు" గా వెరసి, జీవితంలో ఎదుర్కొనబోయే అనుభవ సారాలు అనే అద్భుత భావాన్ని పుస్తకం పేరులోనే స్ఫురింపజేశారు. జీవిత సత్యాన్ని తెలియజేసే మంచి బొమ్మ ముఖచిత్రంగా చక్కగా, ఆకర్షణీయంగా, తగినదిగా పాణిగారి కుంచె అద్భుతాన్ని సృష్టించింది.
నేటి కాలంలో దాదాపుగా ప్రతి పాఠశాలలో కూడా " చదువు, పరీక్ష, ర్యాంకు" అనే ముచ్చటైన మూడు ముక్కలాటకు తప్ప, నైతిక విలువలకు, కళలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని పరిస్థితి నెలకొని వున్నది. ఇటువంటి తరుణంలో దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి, రేపటి కాలానికి ఒక మంచి తరాన్ని అందివ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి ఒక మంచి పుస్తకాన్ని విడుదల చేయడం ముదావహం.
ఈ పుస్తకం లోని కథలలోకి తొంగి చూస్తే,
ప్రారంభంలోనే తాను జైలులో వుండి కూడా ముసలివాడైన తన తండ్రికి ఎలాగైనా సాయపడాలని మనసులో ఒక ధృఢ సంకల్పంతో కేవలం ఒక ఉత్తరం రాయడం ద్వారా నాన్న పొలాన్ని దున్నింపజేస్తాడు. అలా మనసులో సంకల్పం వుండాలే కాని, ఏదైనా సాధించవచ్చుననే మంచి మనస్తత్వంతో కూడిన విలువున్న కథ "ఉత్తరం దున్నిన పొలం" పుస్తకానికే హైలెట్.
"నిజమైన స్నేహితుడు" కథలో
హరీష్ అనే అబ్బాయికి లుకేమియా వ్యాధి రావడం వలన కీమో థెరపి చేయాల్సివస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్ వలన బాబుకు జుట్టు అంతా రాలి పోతుంది. తోటి పిల్లలంతా ఎగతాళి చేస్తారు. హరీష్ బడికి రావడానికే భయపడతాడు. కాని, ఆ తరగతిలో చదువుతున్న ఏడేళ్ళ సింధు అనే పాప మాత్రం ఆ బాబు ఇంటికి వెళ్ళి, ధైర్యం చెప్పి, తాను బడికి రావాలని , ఎగతాళి వ్యవహారం తాను చూసుకుంటానని చెపుతుంది. హరీష్ కు తోడుగా తాను ఆడపిల్ల అయి వుండీ కూడా తన తల్లిదండ్రులచే ఒట్టు వేయుంచుకొని మరీ , వాళ్ళు బాధపడినా తన జుట్టు మొత్తం తీయుంచుకుంటుంది. విషయం తెలిశాక పాప తల్లిదండ్రులు కూడా కూతురు చిన్నదైనా అంత ఉన్నతంగా ఆలోచించినందుకు సంతోషపడతారు. అలా ఎగతాళి చేస్తున్న పిల్లలకు అంత చిన్న వయసులోనే కనువిప్పు కలిగించిన సింధు అనే పాప నడవడిక ఈ కథ చదివిన పిల్లలకైనా, పెద్దలకైనా కళ్ళు చెమర్చేలా చేస్తుంది.
పిల్లలలో నైతిక విలువలు పెంపొందింప జేయడానికి సంబంధించిన కథలు వుండడం ఒక ఎత్తైతే,
అహింసా మార్గంలో కూడా పిల్లలలో మంచి గుణాలను పెంపొందించవచ్చునని చెప్పే "గాంధేయవాదం" , ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం వుంటుందని తెలిపే "మెదడుకు మేత" లాంటి పెద్దలకు, పిల్లలకు సంబంధించిన కథలుండడం మరో ఎత్తు.
ఈ విధంగా ఈ పుస్తకంలోని ఇరవై ఐదు కథలలో ప్రతి కథా అద్భుతమే. విలువలతో కూడినదే. చిన్నా, పెద్దా అందరూ చదువదగిన పుస్తకం ఇది.
నేటి పిల్లలు అందరూ రాబోయే కాలానికి వారధులు, సమాజ నిర్మాణ సారధులు కాబట్టి, ఆ పిల్లల బాల్యం ఎప్పుడూ తల్లి,తండ్రి, ఉపాధ్యాయుల చెంతనే వుంటుంది కాబట్టి, ఈ పుస్తకాన్ని ముందుగా వారు చదవాలి. అప్పుడు తప్పకుండా సమజంలో కొంత మార్పు వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం.
పొందికైన వాక్య నిర్మాణాలతో, అలతి అలతి పదాలతో చిన్నారులకు సైతం అతి తేలికగా అర్థమయ్యేలా వున్న ఈ అనువాద రచన చేసిన చిలకపాటి రవీంద్రకుమార్ సృష్టి అనిర్వచనీయం.
ఇంత మంచి
విలువలున్న ఈ పుస్తకాన్ని కేవలం 22-00 రూపాయలకే అందిస్తున్నారు దేవినేని
సీతారావమ్మ ఫౌండేషన్ వారు. పుస్తకమును పొందుటకు దేవినేని మధుసూధనరావు, చైర్మన్,
దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు-521 260, కృష్ణా జిల్లా చిరునామాలో గానీ, లేదా
ఫోన్:0866-2862424 లోనూ మరియు email:mdevineni@gmail.com ద్వారా సంప్రదించవచ్చును.
నా ఈ సమీక్షను www.pustakam.net లో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చును
http://pustakam.net/?p=17549
ఉపాధ్యాయునికి
ఒక చక్కని చుక్కాని - "పల్లె పిలిచింది" నవల
-మద్దిరాల శ్రీనివాసులు, టీచర్
ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు ఏ మాత్రం
ఎదుగూ,బొదుగూ లేని ఒక సాధారణ పాఠశాలను అక్కడి గ్రామస్తులు,ఉపాధ్యాయుల సహకారం
సాధించి ఎలా అద్భుతంగా అభివృద్ధి చేశాడనే ఉదంతంతో వ్రాసిన నవల.
సూక్ష్మంగా నవలలోకి తొంగి చూస్తే , ఒక సినిమా ఫక్కీలో
సాగుతుంది ఈ కథ. ఇది మనం చెప్పుకోబోయే ప్రసాద్ అనే ఉపాధ్యాయుని ఆత్మకథ గా
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి చిత్తూరు జిల్లా లో ఎక్కడో ఒక మారు మూలనున్న
జంబాడ అనే గ్రామానికి బదిలీ అవుతుంది.
అతనో బ్యాచులర్. అతను ఇబ్రహీం అనే ఒక అనాధ బాలుడిని చేరదీసి తన వద్దే వుంచుకుంటూ
చదివిస్తుంటాడు. ఆ అబ్బాయితో కలిసి ఎక్కడ వుందో తెలియని జంబాడ గ్రామాన్ని చిరునామా
సహాయంతో ఆరా తీసుకుంటూ సాగే ప్రయాణంతో ప్రారంభం అవుతుంది ఈ నవల.
అంతకు ముందు చిత్తూరు పాఠశాలలో తాను పని చేస్తున్నపుడు
అక్కడి కమిటీ ప్రెసిడెంట్ గారి బావమరిదికి సున్న మార్కులు వస్తే ప్రమోట్ చేయలేదని
నీతి,నిజాయితీ లతో చక్కగా పాఠాలు చెప్పే తనను జంబాడకు హెడ్ మాస్టర్ గా ట్రాన్స్
ఫర్ చేశారు. ఎప్పుడో ఉదయం బయలుదేరిన తను గత స్మృతులు తలచుకుంటూ అతి కష్టంమీద
జంబాడకు చీకటి పడే వేళకు చేరుకుంటాడు. అప్పటికే ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా
ఉన్నతను కొత్తగా తన స్థానంలో వచ్చే వారి కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రసాద్ గారు ఇలా
వెళ్ళారో లేదో వెంటనే ఛార్జ్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ జైలు లోంచి విడుదలైన ఖైదీలా
పరిగెత్తుతాడు. అప్పటికే ఆ పాఠశాలలో
యాభైఆరు మంది పిల్లలతో ముగ్గురు పనిష్మెంట్ పైన, ఇద్దరు కొత్తగా పోస్టింగ్
అయిన టీచర్స్ వున్నారని తెలుస్తుంది. రాత్రికి శ్రీనివాసులు అనే సీనియర్ టీచర్
వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు. తరువాత గతంలో ఉన్న హెడ్ మాస్టర్ ఎప్పుడూ బడికి సరిగా
రాకుండా సంతకాలు చేయడం , జీతాలు తీసుకోవడం తప్ప ఏమీ చేయడని తనమీదే బడి బాధ్యత
ఉంచుతాడని శ్రీనివాసులు సార్ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి వాతావరణంలో
ఇమడలేక తాను ఇక్కడ ఉండలేనని ప్రసాద్ సార్
ట్రాన్స్ ఫర్ చేయుంచుకొని వస్తానని శ్రీనివాసులు సార్ తో చెప్పి తన ప్రయత్నాలు
చేసి కుదరక అదే ఊర్లో వుండవలసి వస్తుంది. ఇక అప్పటినుండి ఆ పాఠశాలలోనే వుంటూ తనవృత్తిపై
గల అంకితభావంతో తోటి ఉపాధ్యాయులలోనూ, గ్రామస్తులలోనూ, ప్రెసిడెంటు, కమిటీ
మెంబర్లలోనూ ఒక్కొక్కరిగా మార్పు తెస్తాడు.
రకరకాల వ్యక్తిత్వాలున్న వాళ్ళ సహకారం సాధించుతాడు. అందరిలోనూ చైతన్యం
తెస్తాడు. చివరికి ఆ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాడు ప్రసాద్ సార్. విద్యార్థులలో
బోధన, బోధనేతర విషయాలు నేర్పుతూ, పిల్లలను విద్యావంతులను చేస్తూనే పాఠశాలకు నూతన
స్థలం సాధించి, అందులో కొత్త పాఠశాల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. బడి ముఖం
కూడా చూడని గ్రామస్తులు, చివరికి ప్రసాద్ సార్ ట్రాన్స్ ఫర్ పై ఆ ఊరు వదలి
వెళుతుంటే కంట తడి పెట్టని వారు లేరు. వృత్తిలో అంకితభావం, పని పట్ల నిబద్ధత,
సమాజం పట్ల బాధ్యత, కలిగి నిస్వార్ధము తో కూడిన ప్రసాద్ గారి జీవితం ప్రతి
ఉపాధ్యాయునికి ఆదర్శం. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడూ ఆశావాద దృక్పథంతో వుంటే
సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన పాత్ర ప్రసాద్ గారిది.
ఇందులో శ్రీనివాసులు సార్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి
పరోపకారంతో తన భార్య ఉద్యోగాన్ని వదులుకోవడం హైలెట్. ప్రసాద్ సార్ కొలీగ్స్ నడుచుకునే కలుపుగోలుతనం,
గ్రామస్తుల పరిచయాలు, పనుల సాధించడం, మొ!!నవన్నీ నేటి టీచర్లకు ఆదర్శాలే. రచయిత వెంకటరత్నం
గారు చిత్తూరు జిల్లా లోని , యాస, భాషలతో నవలలో వాస్తవికతను కళ్ళకు కట్టించాడు.
అందమైన పల్లె వాతావరణంతో కూడిన బాజీ గారు అందించిన
ముఖచిత్ర్రం ఈ పుస్తకానికి మరో హైలెట్. 39 భాగాలుగా 231 పేజీలలో రచించిన ఈ నవల
పాఠకులను బ్రేక్ లేకుండా చదివింపజేస్తుంది. కథ అయినా ఇది ప్రతి ఉపాధ్యాయుడికీ ఒక
చక్కని గైడ్. ఆచరణ సాధ్యమయిన కథ ఇది. రచయితకు తొలి నవలయినా రచనలో ఎంతో అనుభవం
వున్నట్లే అనిపిస్తుంది. సముద్రంలో ప్రయాణించే నావలోని వారికి చుక్కాని లాగా బోధనచేయుచున్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ
నవల తప్పక చదివి తీరవలసిందే. ఇంత మంచి నవలను 2001 లో ద్వితీయ ముద్రణ ద్వారా మనకు
అందించిన హైటెక్ ప్రింట్ సిస్టమ్ లిమిటెడ్ అధినేత శ్రీ దేవినేని మధుసూధన రావు
ఎంతైనా కృతజ్ఞతలు తెలపాలి. అనేకమంది విద్యావేత్తలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇండియా
టుడే, ఆంధ్రభూమి వంటి అనేక పత్రికలు కూడా కొనియాడిన నవల ఇది.
ఆనాటి ఈ నవల ఖరీదు రూ.75.౦౦ లు. ఉపాధ్యాయుడికి అందుబాటులో
వున్న ఖరీదే. కానీ, నేటి పాఠశాల ఉపాధ్యాయులకు బోధనలో మెళకువలకై ఎన్నో శిక్షణలు,
పుస్తకాలు అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నవలను రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు
పంపిణీ చేయవలసిన అవసరం, ప్రతి ఉపాధ్యాయునిచేత చదివించవలసిన అవసరం ఎంతైనా వున్నదని
నేను నొక్కి వక్కాణిస్తున్నాను.
ఈ నవలా కాపీలకు “దేవినేని
మధుసూధనరావు, చైర్మన్, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు-521 260, కృష్ణా
జిల్లా చిరునామాలో గానీ, లేదా ఫోన్:0866-2862424 లోనూ మరియు email:mdevineni@gmail.com ద్వారా సంప్రదించవచ్చును.
నా ఈ సమీక్షను www.pustakam.net లో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చును
http://pustakam.net/?p=17549
" నొప్పి డాక్టరు "పుస్తక సమీక్ష
వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్,
త్రిపురాంతకం, సెల్: 9010619066
**********
పిల్లలకు సరదాగా, జాలీగా పుస్తక పఠనంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించే
ఉద్దేశంతో ముద్రింపబడిన పుస్తకం ఇది. సహజంగా డాక్టరు గారి లాగే పక్షి, జంతు
ప్రేమికులైన పిల్లలకు ఈ పుస్తకం ఆసక్తిగానే వుంటుందని నేను
భావిస్తున్నాను. అంతే కాకుండా ” ఖుషి” టివి లాంటి చానల్స్ లో వచ్చే
కార్టూన్ సినిమాలను వదలకుండా చూస్తున్న నేటి బాలల కోసం, ఒక కార్టూన్
సినిమాను చూసిన ఫీలింగ్ కలిగేలా పుస్తక రూపంలో అందించడం బాగుంది. వినోదంతో
పాటు జంతువులకు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం కూడా వారికి అందిస్తుందీ
పుస్తకం. పుస్తకం పేరు, లోపలి భాష, జంతువుల, పక్షుల చేష్టలు పిల్లలను చాలా
బాగా ఆకట్టుకుంటాయి ఇందులో. పిల్లల మెదడును ఆలోచింపజేస్తుంది. ఇతరులను
గౌరవించడం , మంచిగా మాట్లాడే విధానం, అందరినీ కలుపుకుపోవడం, జంతువులను
ప్రేమించడం లాంటి నైతిక విలువలు కూడా నేర్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే
టి.వి.లకు అతుక్కుపోతూ, చదవడంపై
ఆసక్తి లేని పిల్లలున్న కాలమిది. అలాంటి పిల్లలను సైతం పుస్తక పఠనం వైపు మళ్ళించగల ఒక మంచి టానిక్ ఈ “నొప్పిడాక్టర్” పుస్తకం.
హాయ్ ! పిల్లలూ. మీకోసం ఓ మంచి పుస్తకమర్రా !ఏంటి పుస్తకం పేరా?
విచిత్రంగా వుంది కదూ! నాక్కూడానూ. అందుకే వెంటనే చదివేశాను. భలే తమాషాగా
వుంది. చాలా సరదాగా కూడా వుంది. చదువుతుంటే, ఖుషి టి.వి.లో కార్టూన్ సినిమా
చూసినంత ఉల్లాసమేసింది. ఊ…..నిజం. కాస్త రుచి
చూపించమంటారా….?! సరే అయితే….
నొప్పి డాక్టరు గారితో వాళ్ళ అక్క “వర్వారా”, ఇద్దరు పిల్లలు తాన్యా,
వాన్యా వుంటారు. డాక్టరు గారు జంతు, పక్షి ప్రేమికుడు. ఎంతటి జంతు
ప్రేమికుడంటే, తన ఇంట్లో ఎప్పుడూ అల్మారాలో ఉడుత, గదిలో కుందేళ్ళు, చెక్క
అరలో కాకి, సోఫాలో ముళ్ళపంది ఇలా ఆయన చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటాయి. పైగా
డాక్టర్ గారు జాలి గుండె కలవారు. అందుకే ప్రకృతి కంటే కూడా డాక్టరు గారి
ఇల్లే వాటికి స్వర్గంలా అనిపించేది. అతని దగ్గరకు వచ్చే రోగులంతా
నొప్పి,..నొప్పి… అంటూ వస్తుంటారు. వారికి వచ్చిన ఎలాంటి నొప్పినైనా సరే!
క్షణాల్లో తన వైద్యంతో మాయం చేస్తారు. అందుకే అందరూ “నొప్పి డాక్టరు ” అని
పిలవసాగారు. ఈయన దగ్గరికి వైద్యం కోసం వచ్చి డాక్టరు గారి ఇంట్లో వాతావరణం
చూసి, ముగ్ధులైపోయి అక్కడ సెటిలైపోయినవారే వాన్యా, తాన్యా లు. అంతటి
ఆకర్షణీయ వాతావరణం అక్కడ ఉంటుంది. ఆయన అందరిపై చూపించే ప్రేమ అలాంటిది మరి.
ఇందులో ప్రాణుల పేర్లు కూడా చాలా విచిత్రంగా , తమాషాగా వుంటాయి. బాతు
పేరు “కికా”, పంది పిల్ల పేరు “గుర్రు గుర్రు”, చిలుక పేరు “కరుడొ”,
గుడ్లగూబ పేరు “బుంబా….ఇలా. అంతే కాదర్రోయ్! ఇందులో జంతువులు, పక్షులు
మాట్లాడతాయి కూడా ! ఆ…. వాటి భాష కూడా భలే తమాషాగా వుంది. ఏంటి? నమ్మడం
లేదా? అయితే ఓ చిన్న సంభాషణ చూడండి.
ఒక రోజు ఒక గుర్రం, “లామా, వనోయ్, ఫిఫి, కుకు” అంటూ మన డాక్టరు గారి
దగ్గరకు వస్తుంది. అంటే….”నాకు కళ్ళు పోటుగా వున్నాయి. కళ్ళజోడు ఇవ్వండి”
అని అర్థమట. వెంటనే మన డాక్టరు గారు, “కపూకీ, కపూమాకీ” అంటాడు. అంటే,
“దయచేసి కూర్చోండి” అని అట. ఏంటీ! ఇదేం భాషా? అనుకుంటున్నారు కదూ! అదేమరి,
జంతు భాష అంటే. వాళ్ళకు అర్థమయ్యిందిలెండి. అందుకే డాక్టరు గారు అలా అనగానే
అది కూర్చుంది. ఇంకేముంది, కళ్ళకు అద్దాలు పెట్టేశారు మరి. ఫీజు లేదు,
బిల్లూ లేదు. ఉచితమేనర్రా! ఊ….. చూశారా! మన డాక్టరు గారిది జాలిగుండె అని
తెలిసిందిగా. వెంటనే దానికి కళ్ళ నొప్పి ఇట్టే మాయమయింది. వారెవ్వా…!
నొప్పి డాక్టరా …మజాకానా…!. ఇక వెంటనే ఆ గుర్రం “చాకా” అంటూ తోక
ఆడించుకుంటూ, జాలీగా కళ్ళద్దాలతో వీథిలోకి వెళ్ళిపోయింది. “ఓ! “చాకా”
అంటేనా? ధన్యవాదాలు అనట.
ఇలా గుర్రం వలన విషయం తెలుసుకున్న కళ్ళ నొప్పులున్న ఆవులూ, కుక్కలూ, పిల్లులూ, ఆఖరికి ముసలి కాకులు కూడా మన డాక్టరు గారి దగ్గరికి
వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా కళ్ళజోళ్ళను ఫ్రీగా తగిలించేవారు. ఈ విధంగా
ఊళ్ళో మనుషులతో పాటు అడవిలోని జంతువులూ, పక్షులు, నీళ్ళలోని
తాబేళ్ళు, ఆకాశంలోని కొంగలూ, గ్రద్దలూ నొప్పులున్న ప్రతి ప్రాణీ ధైర్యంగా
డాక్టరు గారి దగ్గరికి వైద్యానికి వచ్చేవి. కొద్ది కాలంలోనే మన
నొప్పిడాక్టరు గారికి అందరూ అభిమానులైపోయారు.
ఇంకో రోజు మెడనొప్పి అంటూ, ఒక కోతి వస్తుంది దాని పేరు “కిచకిచ”. దానికి
వైద్యం చేస్తారు. అది అక్కడే వుండి పోతుంది. ఒకనాడు దాని యజమాని
వస్తాడు. అతను రాగానే మన టామీ, “గుర్..గుర్…” మంటుంది. అంటే “పారిపో! లేకుంటే కరిచేస్తాను,” అని అర్థమట. బ్రతుకుజీవుడా! అనుకుంటూ
పారిపోతాడతను. నొప్పి డాక్టరైనా నొప్పులే కాదర్రోయ్! రెక్క తెగిన సీతాకోక
చిలుక వస్తే, దానికి ఎర్ర చుక్కలతో మెరిసిపోతున్న సిల్కు గుడ్డతో రెక్క
కుట్టి , నిప్పుకు దూరంగా వుండమంటూ జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తారు.
సూపర్ కదా! ఇందులో మరో విచిత్ర జంతువు కూడా వుందర్రోయ్. దాని పేరు “తోపుడు
లాగుడు”. ఆ… ఏంటి? నవ్వు వస్తోందా? అవును, జంతువుల పేర్ల లాగే ఈ కథల్లో
డైలాగులు కూడా ఇంకా చాలా …భలే భలే సరదాగా వున్నాయ్.
“కరాబుకి, మరాబుకి, బూ” అంటే “మీకు సాయం చేయకుండా ఎలా వుంటాం?”
“ఆబుజో, మబుజో, బాక్” అంటే “మేము మిమ్మల్ని వదిలిపెట్టం, మీ నమ్మిన నేస్తాలుగా ఉండిపోతాం”
“కిసాఫా, మాక్” అనగా “ఇది నొప్పి డాక్టర్ గారి ఇల్లేనా?” అనట. భలే వున్నాయి కదా!
అంతేనా? ఇలా జంతువులు, డాక్టరు గారు కలిసి కోతులకు వైద్యం చేయడానికని,
సముద్రంలో ఓడపై ఆఫ్రికా కూడా వెళ్తారు. మరి ఈ ప్రయాణంలో డాక్టరు గారికి
చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మన డాక్టరు గారికి జంతువులు సాయం
చేస్తాయి. ఇలా ఎంతో సరదాగా సాగే, “మర్కట రాజ్యానికి యాత్ర,”, పింటూ,
సముద్రపు దొంగలు” అనే రెండు కథలు సరదా సరదా బొమ్మలతో ఇందులో చాలా బాగా
వున్నాయి . ఏంటి? రుచి చూపిస్తూ ఉంటేనే మనసు ఊరించి పోతోందా!? అయితే, ఇంకేం
? చదివేయండి మరి ఈ పుస్తకాన్ని. మీకు బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. చాలా
ఎంజాయ్ చేస్తారు.
ఎంతో సరదాగా , జాలీగా విజ్ఞానంతో కూడిన ఈ పుస్తకం రష్యా భాషలో “కొర్నేయ్ చుకోవ్ స్కీ”
అనే రచయిత వ్రాయగా 1986 లో ప్రథమంగా ముద్రింపబడింది. దీనిని “ఆర్వియార్ ”
అనే రచయిత తెలుగులో అనువదించగా, వి.దువిదేవ్ గారితో చక్కని బొమ్మలు
వేయించి, పిల్లల ప్రేమికులు, బాలలసాహిత్య ప్రచురణ కర్తలు అయిన దేవినేని
సీతారావమ్మ ఫౌండేషన్ వారు చక్కటి అందమైన బైండింగ్ తో పిల్లలు చదివేందుకు
వీలైన అచ్చుతో ఇదిగో ఇటీవలనే జులై 2015 లోనే ఇలా ఇండియాలో మన ముందుకు
తెచ్చారు.
180 పేజీలతో హైదరాబాద్ లోని చరిత ఇంప్రెషన్స్ వారు ముద్రించిన ఈ బుక్ చాలా ఇంప్రెసివ్ గా వున్నది. దీని ఖరీదు రూ|| 200-00 లు. కాస్త
ఖరీదనిపించినా, దీన్ని చదివిన పిల్లలు పొందే ఆనందం, విజ్ఞానాల ముందు ధర దిగదుడుపే.
ప్రతులు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు, కృష్ణా జిల్లా, పిన్: 521260 అను చిరునామాలోనూ; సెల్: 9989051200, email:
mdevineni@gmail.com ద్వారానూ పొందవచ్చును.
మరో చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీథి నెం:1, తార్నాక,
సికింద్రాబాద్, పిన్:500017, సెల్: 9490746614, email:
info@manchipustakam.in, website: www.manchipustakam.in
" నొప్పి డాక్టరు "పుస్తక సమీక్ష
త్రిపురాంతకం, సెల్: 9010619066
**********
పిల్లలకు సరదాగా, జాలీగా పుస్తక పఠనంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ముద్రింపబడిన పుస్తకం ఇది. సహజంగా డాక్టరు గారి లాగే పక్షి, జంతు ప్రేమికులైన పిల్లలకు ఈ పుస్తకం ఆసక్తిగానే వుంటుందని నేను భావిస్తున్నాను. అంతే కాకుండా ” ఖుషి” టివి లాంటి చానల్స్ లో వచ్చే కార్టూన్ సినిమాలను వదలకుండా చూస్తున్న నేటి బాలల కోసం, ఒక కార్టూన్ సినిమాను చూసిన ఫీలింగ్ కలిగేలా పుస్తక రూపంలో అందించడం బాగుంది. వినోదంతో పాటు జంతువులకు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం కూడా వారికి అందిస్తుందీ పుస్తకం. పుస్తకం పేరు, లోపలి భాష, జంతువుల, పక్షుల చేష్టలు పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటాయి ఇందులో. పిల్లల మెదడును ఆలోచింపజేస్తుంది. ఇతరులను గౌరవించడం , మంచిగా మాట్లాడే విధానం, అందరినీ కలుపుకుపోవడం, జంతువులను ప్రేమించడం లాంటి నైతిక విలువలు కూడా నేర్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే టి.వి.లకు అతుక్కుపోతూ, చదవడంపై
ఆసక్తి లేని పిల్లలున్న కాలమిది. అలాంటి పిల్లలను సైతం పుస్తక పఠనం వైపు మళ్ళించగల ఒక మంచి టానిక్ ఈ “నొప్పిడాక్టర్” పుస్తకం.
హాయ్ ! పిల్లలూ. మీకోసం ఓ మంచి పుస్తకమర్రా !ఏంటి పుస్తకం పేరా? విచిత్రంగా వుంది కదూ! నాక్కూడానూ. అందుకే వెంటనే చదివేశాను. భలే తమాషాగా వుంది. చాలా సరదాగా కూడా వుంది. చదువుతుంటే, ఖుషి టి.వి.లో కార్టూన్ సినిమా చూసినంత ఉల్లాసమేసింది. ఊ…..నిజం. కాస్త రుచి
చూపించమంటారా….?! సరే అయితే….
నొప్పి డాక్టరు గారితో వాళ్ళ అక్క “వర్వారా”, ఇద్దరు పిల్లలు తాన్యా, వాన్యా వుంటారు. డాక్టరు గారు జంతు, పక్షి ప్రేమికుడు. ఎంతటి జంతు ప్రేమికుడంటే, తన ఇంట్లో ఎప్పుడూ అల్మారాలో ఉడుత, గదిలో కుందేళ్ళు, చెక్క అరలో కాకి, సోఫాలో ముళ్ళపంది ఇలా ఆయన చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటాయి. పైగా డాక్టర్ గారు జాలి గుండె కలవారు. అందుకే ప్రకృతి కంటే కూడా డాక్టరు గారి ఇల్లే వాటికి స్వర్గంలా అనిపించేది. అతని దగ్గరకు వచ్చే రోగులంతా నొప్పి,..నొప్పి… అంటూ వస్తుంటారు. వారికి వచ్చిన ఎలాంటి నొప్పినైనా సరే! క్షణాల్లో తన వైద్యంతో మాయం చేస్తారు. అందుకే అందరూ “నొప్పి డాక్టరు ” అని పిలవసాగారు. ఈయన దగ్గరికి వైద్యం కోసం వచ్చి డాక్టరు గారి ఇంట్లో వాతావరణం చూసి, ముగ్ధులైపోయి అక్కడ సెటిలైపోయినవారే వాన్యా, తాన్యా లు. అంతటి ఆకర్షణీయ వాతావరణం అక్కడ ఉంటుంది. ఆయన అందరిపై చూపించే ప్రేమ అలాంటిది మరి.
ఇందులో ప్రాణుల పేర్లు కూడా చాలా విచిత్రంగా , తమాషాగా వుంటాయి. బాతు పేరు “కికా”, పంది పిల్ల పేరు “గుర్రు గుర్రు”, చిలుక పేరు “కరుడొ”,
గుడ్లగూబ పేరు “బుంబా….ఇలా. అంతే కాదర్రోయ్! ఇందులో జంతువులు, పక్షులు మాట్లాడతాయి కూడా ! ఆ…. వాటి భాష కూడా భలే తమాషాగా వుంది. ఏంటి? నమ్మడం లేదా? అయితే ఓ చిన్న సంభాషణ చూడండి.
ఒక రోజు ఒక గుర్రం, “లామా, వనోయ్, ఫిఫి, కుకు” అంటూ మన డాక్టరు గారి దగ్గరకు వస్తుంది. అంటే….”నాకు కళ్ళు పోటుగా వున్నాయి. కళ్ళజోడు ఇవ్వండి” అని అర్థమట. వెంటనే మన డాక్టరు గారు, “కపూకీ, కపూమాకీ” అంటాడు. అంటే, “దయచేసి కూర్చోండి” అని అట. ఏంటీ! ఇదేం భాషా? అనుకుంటున్నారు కదూ! అదేమరి, జంతు భాష అంటే. వాళ్ళకు అర్థమయ్యిందిలెండి. అందుకే డాక్టరు గారు అలా అనగానే అది కూర్చుంది. ఇంకేముంది, కళ్ళకు అద్దాలు పెట్టేశారు మరి. ఫీజు లేదు, బిల్లూ లేదు. ఉచితమేనర్రా! ఊ….. చూశారా! మన డాక్టరు గారిది జాలిగుండె అని తెలిసిందిగా. వెంటనే దానికి కళ్ళ నొప్పి ఇట్టే మాయమయింది. వారెవ్వా…! నొప్పి డాక్టరా …మజాకానా…!. ఇక వెంటనే ఆ గుర్రం “చాకా” అంటూ తోక ఆడించుకుంటూ, జాలీగా కళ్ళద్దాలతో వీథిలోకి వెళ్ళిపోయింది. “ఓ! “చాకా” అంటేనా? ధన్యవాదాలు అనట.
ఇలా గుర్రం వలన విషయం తెలుసుకున్న కళ్ళ నొప్పులున్న ఆవులూ, కుక్కలూ, పిల్లులూ, ఆఖరికి ముసలి కాకులు కూడా మన డాక్టరు గారి దగ్గరికి
వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా కళ్ళజోళ్ళను ఫ్రీగా తగిలించేవారు. ఈ విధంగా ఊళ్ళో మనుషులతో పాటు అడవిలోని జంతువులూ, పక్షులు, నీళ్ళలోని
తాబేళ్ళు, ఆకాశంలోని కొంగలూ, గ్రద్దలూ నొప్పులున్న ప్రతి ప్రాణీ ధైర్యంగా డాక్టరు గారి దగ్గరికి వైద్యానికి వచ్చేవి. కొద్ది కాలంలోనే మన నొప్పిడాక్టరు గారికి అందరూ అభిమానులైపోయారు.
ఇంకో రోజు మెడనొప్పి అంటూ, ఒక కోతి వస్తుంది దాని పేరు “కిచకిచ”. దానికి వైద్యం చేస్తారు. అది అక్కడే వుండి పోతుంది. ఒకనాడు దాని యజమాని
వస్తాడు. అతను రాగానే మన టామీ, “గుర్..గుర్…” మంటుంది. అంటే “పారిపో! లేకుంటే కరిచేస్తాను,” అని అర్థమట. బ్రతుకుజీవుడా! అనుకుంటూ
పారిపోతాడతను. నొప్పి డాక్టరైనా నొప్పులే కాదర్రోయ్! రెక్క తెగిన సీతాకోక చిలుక వస్తే, దానికి ఎర్ర చుక్కలతో మెరిసిపోతున్న సిల్కు గుడ్డతో రెక్క కుట్టి , నిప్పుకు దూరంగా వుండమంటూ జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తారు. సూపర్ కదా! ఇందులో మరో విచిత్ర జంతువు కూడా వుందర్రోయ్. దాని పేరు “తోపుడు లాగుడు”. ఆ… ఏంటి? నవ్వు వస్తోందా? అవును, జంతువుల పేర్ల లాగే ఈ కథల్లో డైలాగులు కూడా ఇంకా చాలా …భలే భలే సరదాగా వున్నాయ్.
“కరాబుకి, మరాబుకి, బూ” అంటే “మీకు సాయం చేయకుండా ఎలా వుంటాం?”
“ఆబుజో, మబుజో, బాక్” అంటే “మేము మిమ్మల్ని వదిలిపెట్టం, మీ నమ్మిన నేస్తాలుగా ఉండిపోతాం”
“కిసాఫా, మాక్” అనగా “ఇది నొప్పి డాక్టర్ గారి ఇల్లేనా?” అనట. భలే వున్నాయి కదా!
అంతేనా? ఇలా జంతువులు, డాక్టరు గారు కలిసి కోతులకు వైద్యం చేయడానికని, సముద్రంలో ఓడపై ఆఫ్రికా కూడా వెళ్తారు. మరి ఈ ప్రయాణంలో డాక్టరు గారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మన డాక్టరు గారికి జంతువులు సాయం చేస్తాయి. ఇలా ఎంతో సరదాగా సాగే, “మర్కట రాజ్యానికి యాత్ర,”, పింటూ, సముద్రపు దొంగలు” అనే రెండు కథలు సరదా సరదా బొమ్మలతో ఇందులో చాలా బాగా వున్నాయి . ఏంటి? రుచి చూపిస్తూ ఉంటేనే మనసు ఊరించి పోతోందా!? అయితే, ఇంకేం ? చదివేయండి మరి ఈ పుస్తకాన్ని. మీకు బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తారు.
ఎంతో సరదాగా , జాలీగా విజ్ఞానంతో కూడిన ఈ పుస్తకం రష్యా భాషలో “కొర్నేయ్ చుకోవ్ స్కీ” అనే రచయిత వ్రాయగా 1986 లో ప్రథమంగా ముద్రింపబడింది. దీనిని “ఆర్వియార్ ” అనే రచయిత తెలుగులో అనువదించగా, వి.దువిదేవ్ గారితో చక్కని బొమ్మలు వేయించి, పిల్లల ప్రేమికులు, బాలలసాహిత్య ప్రచురణ కర్తలు అయిన దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు చక్కటి అందమైన బైండింగ్ తో పిల్లలు చదివేందుకు వీలైన అచ్చుతో ఇదిగో ఇటీవలనే జులై 2015 లోనే ఇలా ఇండియాలో మన ముందుకు తెచ్చారు.
180 పేజీలతో హైదరాబాద్ లోని చరిత ఇంప్రెషన్స్ వారు ముద్రించిన ఈ బుక్ చాలా ఇంప్రెసివ్ గా వున్నది. దీని ఖరీదు రూ|| 200-00 లు. కాస్త
ఖరీదనిపించినా, దీన్ని చదివిన పిల్లలు పొందే ఆనందం, విజ్ఞానాల ముందు ధర దిగదుడుపే.
ప్రతులు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు, కృష్ణా జిల్లా, పిన్: 521260 అను చిరునామాలోనూ; సెల్: 9989051200, email:
mdevineni@gmail.com ద్వారానూ పొందవచ్చును.
మరో చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీథి నెం:1, తార్నాక, సికింద్రాబాద్, పిన్:500017, సెల్: 9490746614, email: info@manchipustakam.in, website: www.manchipustakam.in







